సారాంశం
తెలంగాణ: మూసీ సుందరీకరణ కోసం లక్షన్నర కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయటాన్ని బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ తీవ్రంగా తప్పు పట్టారు. మూసీ సుందరీకరణ పనులను కేవలం 16 వేల కోట్లతో చేయవచ్చని ఆయన తెలిపారు. హైడ్రా పేరుతో రేవంత్ సర్కార్ అరాచకం చేస్తోందన్న కేటీఆర్.. పేదల ఇళ్ళ కూల్చివేతలు ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
5 మార్చి, 2026 02:21 PMకి