LIVE
IMG 0112
వెనక్కి
General

మార్చి 31లోపు ఈ పని పూర్తి చేయండి.. లేదంటే మీ పాన్ కార్డ్ చెల్లదు

28 రోజుల క్రితం
Andhra Pradesh, Telangana
సారాంశం

ఏప్రిల్ 1, 2026 నుండి పాన్ (PAN) కార్డు దరఖాస్తు వినియోగ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకువస్తోంది, ఇవి సామాన్యుల రోజువారీ ఆర్థిక లావాదేవీలపై గణనీయమైన ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా, ఇప్పటివరకు కేవలం ఆధార్ కార్డుతోనే పాన్ కార్డు పొందే వీలుండగా, కొత్త నిబంధనల ప్రకారం పుట్టిన తేదీ ధృవీకరణ కోసం బర్త్ సర్టిఫికేట్, ఓటర్ ఐడీ, లేదా పదో తరగతి మార్కుల జాబితా వంటి అదనపు పత్రాలను సమర్పించడం తప్పనిసరి కానుంది. అలాగే, పాన్ కార్డులోని పేరు కచ్చితంగా ఆధార్ కార్డులో ఉన్నట్టుగానే ఉండాలని, లేనిపక్షంలో దరఖాస్తులు తిరస్కరించబడతాయని ,సులభంగా ఆధార్‌తో పాన్ పొందాలనుకునే వారు మార్చి 31లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.

షేర్ చేయండి:
22 మార్చి, 2026 05:18 PMకి

సంబంధిత వార్తలు

EC WARNING: సోషల్‌ మీడియా పోస్టులపై ఈసీ చర్యలు

EC WARNING: సోషల్‌ మీడియా పోస్టులపై ఈసీ చర్యలు

ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా లో తప్పుదోవ పట్టించే పోస్టులు, చట్టవిరుద్ధమైన కంటెంట్‌పై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు 11 వేల సోషల్ మీడియా పోస్టులు, ఇతర కంటెంట్‌పై చర్యలు తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ నెల 23న TN, ఈ నెల 23, 29న రెండు దశల్లో WBలో పోలింగ్ ఉంది.

6 గంటల క్రితం
హైదరాబాద్ లో వడగండ్ల వాన..బీ అలర్ట్!

హైదరాబాద్ లో వడగండ్ల వాన..బీ అలర్ట్!

హైదరాబాద్ వడగండ్ల వాన కురిసింది. కూకట్‌పల్లి, మూసాపేట్, జేఎన్‌టీయూ , నిజాంపేట్, కేపీహెచ్‌బీకాలనీ, ప్రగతి నగర్ బాచుపల్లి తదితర ప్రాంతాల్లో సాయంత్రం అకస్మాత్తుగా వడగళ్ల వాన పడింది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వచ్చే కొన్ని గంటలు ఉరుములు, గాలులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు... కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

6 గంటల క్రితం
మారథాన్ లో మనుషులను ఓడించిన చైనా రోబోలు

మారథాన్ లో మనుషులను ఓడించిన చైనా రోబోలు

బీజింగ్‌లో జరిగిన ఓ హాఫ్ మారథాన్‌లో హ్యూమనాయిడ్ రోబోలు మానవ అథ్లెట్లను ఓడించాయి. 12,000 మంది మానవ రన్నర్లతో చైనాలో తయారైన వందలాది హ్యూమనాయిడ్ రోబోలు పోటీపడ్డాయి. ఈ రోబోలు వేగంతో పరుగెత్తి, ఏకంగా ప్రపంచ రికార్డును సైతం బద్దలు కొట్టాయి. ఈ అద్భుత ప్రదర్శన, రోబో సాంకేతికతలో జరుగుతున్న వేగవంతమైన పురోగతికి నిదర్శనంగా నిలిచింది.

7 గంటల క్రితం
BREAKING: ఎయిర్ టెల్ బిగ్ షాక్.. రీఛార్జ్ కష్టమే..!

BREAKING: ఎయిర్ టెల్ బిగ్ షాక్.. రీఛార్జ్ కష్టమే..!

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. రీఛార్జ్ ప్లాన్ ధరలను అనూహ్యంగా పెంచింది. డెయిలీ 1.5GB ప్లాన్ తో ఉన్న రూ.799 ప్లాన్ ను ఏకంగా 899గా పెంచింది. అటు 56 రోజుల ప్లాన్ రూ. 859 పూర్తిగా రద్దు చేసింది. ఈ పెంపు వినియోగదారులకు భారీ షాక్ ఇస్తోంది.

7 గంటల క్రితం