టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత మొదటిసారి విజయ్ సొంత ఊరైన నాగర్కర్నూల్ జిల్లాలోని తుమ్మెనపేటకు చేరుకున్నారు. అక్కడ తమ కొత్త ఇంట్లో ఈ నూతన దంపతులు అత్యంత భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు వారికి ఘనస్వాగతం పలికారు. సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న ఈ జంట వ్రతంలో పాల్గొన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉదయ్పూర్లో వీరి వివాహం జరిగిన తర్వాత, కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల సమక్షంలో ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్చి 4న హైదరాబాద్లో వీరి వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది.
సంబంధిత వార్తలు

దురంధర్ ఓటీటీ డేట్స్
బిగ్గెస్ట్ బాక్సాఫీస్ సక్సెస్ అయ్యిన లేటెస్ట్ చిత్రమే “ధురంధర్ 2”. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టి దుమ్ము లేపుతుంది. రణ్వీర్ సింగ్ హీరోగా సారా అర్జున్ హీరోయిన్ గా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ నాలుగు గంటల స్పై యాక్షన్ చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో స్టడీగా దూసుకెళ్తుంది. ధురంధర్ 2 ని జియో హాట్ స్టార్ వారు ఈ మే 27 లేదా జూన్ 4 నుంచి అందుబాటులో ఉండొచ్చని తెలుస్తుంది.

పౌరాణిక పాత్రల మధ్య పోరు
భారతీయ చిత్ర పరిశ్రమలో మళ్లీ పౌరాణిక చిత్రాల ట్రెండ్ మొదలైంది. ఒకప్పుడు భక్తిరస చిత్రాలకే పరిమి తమైన పురాణ గాథలిప్పుడు అత్యాధునిక సాంకేతికతతో సినిమాటిక్ గా రూపాంతరం చెందుతున్నాయి. `రామాయణ`, `మహాభారతం` నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించ డానికి సిద్ధమవుతున్నాయి. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అగ్ర కథానాయకులు పౌరాణిక పాత్రల్లో పరకాయ ప్రవేశం.

‘అన్ని ఓ గురుతులు’ కి మంచి గుర్తింపు
వెంకట్ చల్లగుండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అన్ని ఓ గురుతులు ’పుట్టుకతోనే మన జీవితంతో ఎన్నో బంధాలు పెనవేసుకుపోతాయి. ప్రతి బంధం ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. నేనున్నాను అనే ధైర్యాన్ని ఇస్తుంది. ఒక నిజమైన తోడుగా ఉంటానని నమ్మకాన్ని కలిగిస్తుంది కానీ నీ అసలైన తోడు ఎవరు అనేది తెలిసే సరికి జీవితం మొత్తం ఖర్చు అయ్యుంటుంది.

గుండెపోటుతో ప్రముఖ ఎడిటర్ మధు రెడ్డి కన్నుమూత
తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కరీంనగర్కు చెందిన ప్రముఖ ఎడిటర్ మధు రెడ్డి హైదరాబాద్లోని మణికొండలో ఏప్రిల్ 18న గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సహచరులు, స్నేహితులు, ఆయనతో కలిసి పనిచేసిన సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి, దుఃఖానికి లోనయ్యారు. ఎడిటర్గా మధు రెడ్డికి ఇండస్ట్రీలో మంచి పేరుంది.