మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంతో దేశవ్యాప్తంగా జన ఆక్రోస్ ర్యాలీ నిర్వహించేందుకు NDA కూటమి సిద్ధమైంది. మహిళా లోకానికి అన్యాయం చేసే విధంగా ఇండియా కూటమి వ్యవహరించిందని బీజేపీ మండిపడుతోంది. కాంగ్రెస్, ఇండియా కూటమి బిల్లు పట్ల వ్యవహరించిన తీరును ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కూటమి పార్టీలను కలుపుకుని జన ఆక్రోస్ ర్యాలీలు తీయనున్నారు.
సంబంధిత వార్తలు

BREAKING: ఆగమైన హైద్రాబాద్.. రంగంలోకి హైడ్రా
నగరంలో కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, బాచుపల్లి, సుచిత్ర తదితర ప్రాంతాల్లో వర్షానికి 53 చోట్ల చెట్లు పడిపోయాయి. 4సె.మీ. వర్షం కురవగా 8 చోట్ల రహదారులపై వర్షం నీరు నిలిచిపోయింది. ఈ ఫిర్యాదులను హైడ్రా సిబ్బంది క్లియర్ చేశారు. నగరవ్యాప్తంగా ఈదురుగాలులు వీచాయి. పలు చోట్ల చెట్లు పడిపోయినట్టు హైడ్రా కంట్రోల్ రూమ్ కి ఫిర్యాదులు రాగా రాత్రి 8.30 ప్రాంతం వరకు అన్ని క్లియర్ చేసినట్టు హైడ్రా తెలిపింది.

మిస్ ఇండియా 2026 విజేతగా సాధ్వి సైల్
ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగిన 61వ ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో గోవాకు చెందిన సాధ్వి సతీశ్ సైల్ విజేతగా నిలిచారు. గతేడాది విజేత నికితా పోర్వాల్ చేతుల మీదుగా ఆమె కిరీటాన్ని అందుకున్నారు. మోడల్, వ్యాపారవేత్త అయిన సాధ్వి, త్వరలో జరగబోయే 75వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత ప్రతినిధిగా పాల్గొంటారు. MHకు చెందిన రాజనందిని పవార్ మొదటి రన్నరప్గా, జమ్మూ కాశ్మీర్కు చెందిన శ్రీ అద్వైత రెండో రన్నరప్గా నిలిచారు.

తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టండి
రాష్ట్రాభివృద్ధిపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అలాంటి ప్రచారాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని నేతలకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, ప్రభుత్వ సేవల వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై సమీక్ష చేశారు.

ఇరాన్ ఒప్పుకుంటే సరి..లేదంటే నేనేంటో చూపిస్తా: ట్రంప్
తమ ఒప్పందానికి అంగీకరించకపోతే ఇరాన్లోని ప్రతి విద్యుత్ కేంద్రాన్ని, వంతెనను నాశనం చేస్తామంటూ...అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య రెండో దఫా చర్చల కోసం రేపు అమెరికా ప్రతినిధి బృందం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్కు వెళ్లనుంది. తమ ప్రతిపాదనలకు ఇరాన్ అంగీకరిస్తుందని ఆశిస్తున్నామన్నారు ట్రంప్. లేకపోతే తానేంటో చూపిస్తానంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
