LIVE
ఇరాన్ కు ట్రంప్ సీరియస్ వార్నింగ్
వెనక్కి
Crime

ఇరాన్ కు ట్రంప్ సీరియస్ వార్నింగ్

47 రోజుల క్రితం
సారాంశం

ఇరాన్‌పై అమెరికా మరియు ఇజ్రాయెల్ ఉమ్మడి సైనిక చర్య 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' రెండో దశకు చేరుకుందని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వచ్చే 24 గంటల్లో ఇరాన్ క్షిపణి కేంద్రాలే లక్ష్యంగా మరిన్ని విధ్వంసకర దాడులు జరుగుతాయని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఈ యుద్ధం మరో నాలుగు నుండి ఐదు వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో, గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా పౌరులు తక్షణమే ఆ ప్రాంతాలను వీడాలని స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా యూఏఈ, కతార్, సౌదీ అరేబియా, బహ్రెయిన్ వంటి 14 దేశాల్లో ఉన్నవారు అందుబాటులో ఉన్న విమానాల ద్వారా వెంటనే వెళ్ళిపోవాలని సూచించారు. ఇరాన్ అణ్వాయుధాలను నిర్మించకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ట్రంప్ ఉద్ఘాటించారు.

షేర్ చేయండి:
3 మార్చి, 2026 11:21 AMకి

సంబంధిత వార్తలు

BREAKING: ఆగమైన హైద్రాబాద్.. రంగంలోకి హైడ్రా

BREAKING: ఆగమైన హైద్రాబాద్.. రంగంలోకి హైడ్రా

నగరంలో కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, బాచుపల్లి, సుచిత్ర తదితర ప్రాంతాల్లో వర్షానికి 53 చోట్ల చెట్లు పడిపోయాయి. 4సె.మీ. వర్షం కురవగా 8 చోట్ల రహదారులపై వర్షం నీరు నిలిచిపోయింది. ఈ ఫిర్యాదులను హైడ్రా సిబ్బంది క్లియర్ చేశారు. నగరవ్యాప్తంగా ఈదురుగాలులు వీచాయి. పలు చోట్ల చెట్లు పడిపోయినట్టు హైడ్రా కంట్రోల్ రూమ్ కి ఫిర్యాదులు రాగా రాత్రి 8.30 ప్రాంతం వరకు అన్ని క్లియర్ చేసినట్టు హైడ్రా తెలిపింది.

27 నిమిషాల క్రితం
డబ్బున్న మైనర్లను ట్రాప్ చేస్తున్న ముఠా అరెస్ట్

డబ్బున్న మైనర్లను ట్రాప్ చేస్తున్న ముఠా అరెస్ట్

ఇన్‌స్టాలో డబ్బున్న బాలికలను ట్రాప్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కీలక నిందితుడు అర్జున్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విదేశాల్లో ఉంటున్న తల్లిదండ్రుల పిల్లలను, హైదరాబాద్‌లోని అత్యంత సంపన్న కుటుంబాలకు చెందిన మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుంటోంది ఈ గ్యాంగ్. ఒంటరిగా ఉండే పిల్లల బలహీనతలను ఆసరాగా చేసుకుని...సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వారితో స్నేహం నటిస్తూ ట్రాప్ చేస్తున్నారు.

30 నిమిషాల క్రితం
OPERATION OCTOPUSE: 32 మంది బ్యాంక్ అధికారులు అరెస్ట్

OPERATION OCTOPUSE: 32 మంది బ్యాంక్ అధికారులు అరెస్ట్

HYD పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ ఆక్టోపస్-2.0’ ద్వారా దేశవ్యాప్త సైబర్ మోసాల ముఠా గుట్టురట్టయింది. 9 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన పోలీసులు, 32 మంది బ్యాంకు అధికారులు సహా మొత్తం 52 మందిని అరెస్ట్ చేశారు. నేరగాళ్లకు సహకరిస్తూ అక్రమ ఖాతాలు తెరిచి ఇచ్చిన బ్యాంకర్లే టార్గెట్‌గా ఈ ఆపరేషన్ సాగింది. ట్రేడింగ్, డిజిటల్ అరెస్ట్ పేరుతో దాదాపు రూ.150 కోట్ల మేర వీరు దోచుకున్నారు.

1 గంటల క్రితం
TN : బాణాసంచా ఫ్యాక్టరీ ప్రమాదం .. 21కి చేరిన మృతులు

TN : బాణాసంచా ఫ్యాక్టరీ ప్రమాదం .. 21కి చేరిన మృతులు

TN: విరుదునగర్ జిల్లాలో బాణసంచా ఫ్యాక్టరీ పేలుడులో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. 21 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ పేలుడు ధాటికి నాలుగు గదులు పూర్తిగా నేలమట్టమయ్యాయి. సుమారు 10 కిలోమీటర్ల మేర భూమి కంపించినట్లు ప్రకంపనలు వచ్చాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

1 గంటల క్రితం