LIVE
Capture 97
వెనక్కి
General

ఇరాన్ పై ఆగని దాడులు.. ఆచరణకు నోచుకోని ట్రంప్ మాటలు

26 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

పశ్చిమాసియాలో యుద్ధం ఉద్ధృతి మరింత పెరిగింది. చర్చలు జరుగుతున్నాయన్న అమెరికా ప్రకటనల మధ్యే… ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా బలగాలు భారీ దాడులతో విరుచుకు పడ్డాయి. ఇరాన్, లెబనాన్‌లపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతుండగా… గల్ఫ్ దేశాలు, ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది.పర్షియన్ గల్ఫ్ వైపు వేలాది అమెరికా సైనికులు కదులుతుండటం ఉద్రిక్తతను మరింత పెంచుతోంది. ఇదే సమయంలో ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా మహమ్మద్ బాఘెర్ నియమితులయ్యారు. యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటింది.

షేర్ చేయండి:
25 మార్చి, 2026 07:57 AMకి

సంబంధిత వార్తలు

రోడ్డు కోసం మంచంతో పోరాటం..

రోడ్డు కోసం మంచంతో పోరాటం..

నెల్లూరు జిల్లాలోని సైదాపురంలో రోడ్లు సరిగా లేవని ఓ యువకుడు నిరసన చేపట్టాడు. అధికారులు రోడ్డు పనులను సగంలో ఆపేశారని ఆరోపిస్తూ.. నడిరోడ్డుపై మంచం వేసుకుని కూర్చుకున్నాడు. వచ్చే వాహనాలను ఆపేశాడు. వెంటనే రోడ్డు వేయాలని స్థానిక ఎమ్మెల్యేని, అధికారులను డిమాండ్ చేశాడు. లేని పక్షంలో గ్రామస్థులంతా కలిసి డబ్బులు వసూలు చేసి స్వయంగా రోడ్డు వేసుకుంటామని తేల్చి చెప్పాడు.

14 నిమిషాల క్రితం
అతివేగంగా తింటున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే!

అతివేగంగా తింటున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే!

* వేగంగా ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉందని పలు పరిశోధనలు చెబుతున్నాయి * ఆహారాన్ని సరిగ్గా నమలకుండా మింగడం వల్ల జీర్ణక్రియపై భారం పడుతుంది. * టీవీ లేదా మొబైల్ చూస్తూ కాకుండా, ఆహారంపై దృష్టి పెట్టి తినండి. * ప్రతి ముద్దను కనీసం 20-30 సార్లు నమలడం అలవాటు చేసుకోండి.

14 నిమిషాల క్రితం
పాలిసెట్ కు నేడే ఆఖరు.. అప్లై చేశా?

పాలిసెట్ కు నేడే ఆఖరు.. అప్లై చేశా?

TG: తెలంగాణ పాలిసెట్-2026 అప్లికేషన్ గడువు ఈరోజుతో ముగియనున్నది. వచ్చే నెల 13న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పాలిసెట్ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నికల్ కళాశాలల్లో ఇంజినీరింగ్, నాన్ –ఇంజినీరింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంకా అప్లై చేసుకోని అభ్యర్థులు ఈరోజు సాయంత్రం వరకు అప్లై చేయవచ్చు.

22 నిమిషాల క్రితం
పుణ్యక్షేత్రాల దర్శనానికి టైం ఫిక్స్.. IRCTC స్పెషల్ టూర్

పుణ్యక్షేత్రాల దర్శనానికి టైం ఫిక్స్.. IRCTC స్పెషల్ టూర్

వేసవిలో ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకునే వారికి IRCTC అదిరిపోయే ప్యాకేజీని ప్రకటించింది. మే 12న సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో మాతా వైష్ణోదేవి, మథుర, హరిద్వార్, రిషికేశ్ వంటి క్షేత్రాలను దర్శించుకోవచ్చు. 9 రాత్రులు, 10 పగళ్ల పాటు సాగే ఈ యాత్రకు టికెట్ ధర రూ. 16,500 నుంచి ప్రారంభమవుతుంది. భరత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా ఈ ప్రయాణం సాగుతుంది.

24 నిమిషాల క్రితం