జర్నలిజం లోకంలో విషాదం: సీనియర్ రిపోర్టర్ పూర్ణ కన్నుమూత
ప్రముఖ జర్నలిస్ట్, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఏపీ బ్యూరో సీనియర్ రిపోర్టర్ కేసంనేని పూర్ణచంద్రరావు (ఏబీఎన్ పూర్ణ) అనారోగ్యంతో మృతి చెందడం జర్నలిజం రంగంలో విషాదాన్ని నింపింది. విజయవాడలోని ఆయన నివాసంలో భౌతికకాయాన్ని పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాధ్ (చిన్ని) సందర్శించి నివాళులర్పించారు. వర్తమాన రాజకీయాలపై అపారమైన అవగాహన ఉన్న మేధావిని కోల్పోవడం బాధాకరమని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
సంబంధిత వార్తలు

BREAKING: ఆగమైన హైద్రాబాద్.. రంగంలోకి హైడ్రా
నగరంలో కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, బాచుపల్లి, సుచిత్ర తదితర ప్రాంతాల్లో వర్షానికి 53 చోట్ల చెట్లు పడిపోయాయి. 4సె.మీ. వర్షం కురవగా 8 చోట్ల రహదారులపై వర్షం నీరు నిలిచిపోయింది. ఈ ఫిర్యాదులను హైడ్రా సిబ్బంది క్లియర్ చేశారు. నగరవ్యాప్తంగా ఈదురుగాలులు వీచాయి. పలు చోట్ల చెట్లు పడిపోయినట్టు హైడ్రా కంట్రోల్ రూమ్ కి ఫిర్యాదులు రాగా రాత్రి 8.30 ప్రాంతం వరకు అన్ని క్లియర్ చేసినట్టు హైడ్రా తెలిపింది.

మిస్ ఇండియా 2026 విజేతగా సాధ్వి సైల్
ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగిన 61వ ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో గోవాకు చెందిన సాధ్వి సతీశ్ సైల్ విజేతగా నిలిచారు. గతేడాది విజేత నికితా పోర్వాల్ చేతుల మీదుగా ఆమె కిరీటాన్ని అందుకున్నారు. మోడల్, వ్యాపారవేత్త అయిన సాధ్వి, త్వరలో జరగబోయే 75వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత ప్రతినిధిగా పాల్గొంటారు. MHకు చెందిన రాజనందిని పవార్ మొదటి రన్నరప్గా, జమ్మూ కాశ్మీర్కు చెందిన శ్రీ అద్వైత రెండో రన్నరప్గా నిలిచారు.

ఇరాన్ ఒప్పుకుంటే సరి..లేదంటే నేనేంటో చూపిస్తా: ట్రంప్
తమ ఒప్పందానికి అంగీకరించకపోతే ఇరాన్లోని ప్రతి విద్యుత్ కేంద్రాన్ని, వంతెనను నాశనం చేస్తామంటూ...అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య రెండో దఫా చర్చల కోసం రేపు అమెరికా ప్రతినిధి బృందం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్కు వెళ్లనుంది. తమ ప్రతిపాదనలకు ఇరాన్ అంగీకరిస్తుందని ఆశిస్తున్నామన్నారు ట్రంప్. లేకపోతే తానేంటో చూపిస్తానంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
రేపు చంద్రబాబు బర్త్ డే...లోకేష్ సర్ ప్రైజ్
రేపు ఏపీ సీఎం చంద్రబాబు బర్త్ డే ను పురస్కరించుకుని పార్టీ శ్రేణులు భారీగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. చంద్రబాబు 76వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా... ఆయన తనయుడు, మంత్రి లోకేష్ ఒక కామన్ డిస్ప్లే పిక్చర్ ని విడుదల చేశారు. ఈ సీడీపీ విడుదలతో టీడీపీ శ్రేణులు, అభిమానులు సోషల్ మీడియాలో తమ ప్రొఫైల్ చిత్రాలను మార్చుకుంటూ చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.