
'వాలీ' మోషన్ పోస్టర్ను ఆవిష్కరించిన క్రిష్!
ప్రముఖ దర్శకుడు క్రిష్ జగర్లమూడి చేతుల మీదుగా విడుదలైన ‘వాలీ’ చిత్ర మోషన్ పోస్టర్ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. టాలీవుడ్ తెరపై వాలీబాల్ క్రీడ నేపథ్యంలో వస్తున్న మొట్టమొదటి స్పోర్ట్స్ డ్రామాగా గుర్తింపు పొందిన ఈ చిత్రం, టైటిల్ అనౌన్స్మెంట్తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. క్రిష్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా లాంచ్ చేసి చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలియజేశారు.
సంబంధిత వార్తలు

దురంధర్ ఓటీటీ డేట్స్
బిగ్గెస్ట్ బాక్సాఫీస్ సక్సెస్ అయ్యిన లేటెస్ట్ చిత్రమే “ధురంధర్ 2”. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టి దుమ్ము లేపుతుంది. రణ్వీర్ సింగ్ హీరోగా సారా అర్జున్ హీరోయిన్ గా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ నాలుగు గంటల స్పై యాక్షన్ చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో స్టడీగా దూసుకెళ్తుంది. ధురంధర్ 2 ని జియో హాట్ స్టార్ వారు ఈ మే 27 లేదా జూన్ 4 నుంచి అందుబాటులో ఉండొచ్చని తెలుస్తుంది.

పౌరాణిక పాత్రల మధ్య పోరు
భారతీయ చిత్ర పరిశ్రమలో మళ్లీ పౌరాణిక చిత్రాల ట్రెండ్ మొదలైంది. ఒకప్పుడు భక్తిరస చిత్రాలకే పరిమి తమైన పురాణ గాథలిప్పుడు అత్యాధునిక సాంకేతికతతో సినిమాటిక్ గా రూపాంతరం చెందుతున్నాయి. `రామాయణ`, `మహాభారతం` నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించ డానికి సిద్ధమవుతున్నాయి. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అగ్ర కథానాయకులు పౌరాణిక పాత్రల్లో పరకాయ ప్రవేశం.

‘అన్ని ఓ గురుతులు’ కి మంచి గుర్తింపు
వెంకట్ చల్లగుండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అన్ని ఓ గురుతులు ’పుట్టుకతోనే మన జీవితంతో ఎన్నో బంధాలు పెనవేసుకుపోతాయి. ప్రతి బంధం ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. నేనున్నాను అనే ధైర్యాన్ని ఇస్తుంది. ఒక నిజమైన తోడుగా ఉంటానని నమ్మకాన్ని కలిగిస్తుంది కానీ నీ అసలైన తోడు ఎవరు అనేది తెలిసే సరికి జీవితం మొత్తం ఖర్చు అయ్యుంటుంది.

గుండెపోటుతో ప్రముఖ ఎడిటర్ మధు రెడ్డి కన్నుమూత
తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కరీంనగర్కు చెందిన ప్రముఖ ఎడిటర్ మధు రెడ్డి హైదరాబాద్లోని మణికొండలో ఏప్రిల్ 18న గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సహచరులు, స్నేహితులు, ఆయనతో కలిసి పనిచేసిన సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి, దుఃఖానికి లోనయ్యారు. ఎడిటర్గా మధు రెడ్డికి ఇండస్ట్రీలో మంచి పేరుంది.