LIVE
Screenshot 2026 03 24 190856
వెనక్కి
General

ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. హోర్ముజ్ ఉద్రిక్తతలపై చర్చ

26 రోజుల క్రితం
Telangana
సారాంశం

మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. ఇరాన్–ఇజ్రాయెల్ పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించినట్లు సమాచారం. హోర్ముజ్ జలసంధి తెరిచి ఉంచడం ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో శాంతి, స్థిరత్వం అవసరమని ఇద్దరూ ప్రాముఖ్యత ఇచ్చారు. మొత్తం మీద… గ్లోబల్ ఎనర్జీ సెక్యూరిటీపై కీలకంగా ఈ సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది.

షేర్ చేయండి:
24 మార్చి, 2026 07:09 PMకి

సంబంధిత వార్తలు

రోడ్డు కోసం మంచంతో పోరాటం..

రోడ్డు కోసం మంచంతో పోరాటం..

నెల్లూరు జిల్లాలోని సైదాపురంలో రోడ్లు సరిగా లేవని ఓ యువకుడు నిరసన చేపట్టాడు. అధికారులు రోడ్డు పనులను సగంలో ఆపేశారని ఆరోపిస్తూ.. నడిరోడ్డుపై మంచం వేసుకుని కూర్చుకున్నాడు. వచ్చే వాహనాలను ఆపేశాడు. వెంటనే రోడ్డు వేయాలని స్థానిక ఎమ్మెల్యేని, అధికారులను డిమాండ్ చేశాడు. లేని పక్షంలో గ్రామస్థులంతా కలిసి డబ్బులు వసూలు చేసి స్వయంగా రోడ్డు వేసుకుంటామని తేల్చి చెప్పాడు.

16 నిమిషాల క్రితం
అతివేగంగా తింటున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే!

అతివేగంగా తింటున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే!

* వేగంగా ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉందని పలు పరిశోధనలు చెబుతున్నాయి * ఆహారాన్ని సరిగ్గా నమలకుండా మింగడం వల్ల జీర్ణక్రియపై భారం పడుతుంది. * టీవీ లేదా మొబైల్ చూస్తూ కాకుండా, ఆహారంపై దృష్టి పెట్టి తినండి. * ప్రతి ముద్దను కనీసం 20-30 సార్లు నమలడం అలవాటు చేసుకోండి.

16 నిమిషాల క్రితం
పాలిసెట్ కు నేడే ఆఖరు.. అప్లై చేశా?

పాలిసెట్ కు నేడే ఆఖరు.. అప్లై చేశా?

TG: తెలంగాణ పాలిసెట్-2026 అప్లికేషన్ గడువు ఈరోజుతో ముగియనున్నది. వచ్చే నెల 13న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పాలిసెట్ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నికల్ కళాశాలల్లో ఇంజినీరింగ్, నాన్ –ఇంజినీరింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంకా అప్లై చేసుకోని అభ్యర్థులు ఈరోజు సాయంత్రం వరకు అప్లై చేయవచ్చు.

24 నిమిషాల క్రితం
పుణ్యక్షేత్రాల దర్శనానికి టైం ఫిక్స్.. IRCTC స్పెషల్ టూర్

పుణ్యక్షేత్రాల దర్శనానికి టైం ఫిక్స్.. IRCTC స్పెషల్ టూర్

వేసవిలో ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకునే వారికి IRCTC అదిరిపోయే ప్యాకేజీని ప్రకటించింది. మే 12న సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో మాతా వైష్ణోదేవి, మథుర, హరిద్వార్, రిషికేశ్ వంటి క్షేత్రాలను దర్శించుకోవచ్చు. 9 రాత్రులు, 10 పగళ్ల పాటు సాగే ఈ యాత్రకు టికెట్ ధర రూ. 16,500 నుంచి ప్రారంభమవుతుంది. భరత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా ఈ ప్రయాణం సాగుతుంది.

26 నిమిషాల క్రితం