LIVE
Road
వెనక్కి
General

నియమాలు పాటిద్దాం - ప్రమాదాలను నివారిద్దాం.

1 గంటల క్రితం
సారాంశం

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా ISI మార్కు ఉన్న హెల్మెట్ ధరించాలి. కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోవద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడటం లేదా మెసేజ్ చేయడం వంటివి ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. రోడ్డు దాటేటప్పుడు ఎప్పుడూ జీబ్రా క్రాసింగ్ మాత్రమే ఉపయోగించండి.

షేర్ చేయండి:
20 ఏప్రిల్, 2026 11:45 AMకి

సంబంధిత వార్తలు

రోడ్డు కోసం మంచంతో పోరాటం..

రోడ్డు కోసం మంచంతో పోరాటం..

నెల్లూరు జిల్లాలోని సైదాపురంలో రోడ్లు సరిగా లేవని ఓ యువకుడు నిరసన చేపట్టాడు. అధికారులు రోడ్డు పనులను సగంలో ఆపేశారని ఆరోపిస్తూ.. నడిరోడ్డుపై మంచం వేసుకుని కూర్చుకున్నాడు. వచ్చే వాహనాలను ఆపేశాడు. వెంటనే రోడ్డు వేయాలని స్థానిక ఎమ్మెల్యేని, అధికారులను డిమాండ్ చేశాడు. లేని పక్షంలో గ్రామస్థులంతా కలిసి డబ్బులు వసూలు చేసి స్వయంగా రోడ్డు వేసుకుంటామని తేల్చి చెప్పాడు.

19 నిమిషాల క్రితం
అతివేగంగా తింటున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే!

అతివేగంగా తింటున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే!

* వేగంగా ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉందని పలు పరిశోధనలు చెబుతున్నాయి * ఆహారాన్ని సరిగ్గా నమలకుండా మింగడం వల్ల జీర్ణక్రియపై భారం పడుతుంది. * టీవీ లేదా మొబైల్ చూస్తూ కాకుండా, ఆహారంపై దృష్టి పెట్టి తినండి. * ప్రతి ముద్దను కనీసం 20-30 సార్లు నమలడం అలవాటు చేసుకోండి.

19 నిమిషాల క్రితం
పాలిసెట్ కు నేడే ఆఖరు.. అప్లై చేశా?

పాలిసెట్ కు నేడే ఆఖరు.. అప్లై చేశా?

TG: తెలంగాణ పాలిసెట్-2026 అప్లికేషన్ గడువు ఈరోజుతో ముగియనున్నది. వచ్చే నెల 13న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పాలిసెట్ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నికల్ కళాశాలల్లో ఇంజినీరింగ్, నాన్ –ఇంజినీరింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంకా అప్లై చేసుకోని అభ్యర్థులు ఈరోజు సాయంత్రం వరకు అప్లై చేయవచ్చు.

27 నిమిషాల క్రితం
పుణ్యక్షేత్రాల దర్శనానికి టైం ఫిక్స్.. IRCTC స్పెషల్ టూర్

పుణ్యక్షేత్రాల దర్శనానికి టైం ఫిక్స్.. IRCTC స్పెషల్ టూర్

వేసవిలో ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకునే వారికి IRCTC అదిరిపోయే ప్యాకేజీని ప్రకటించింది. మే 12న సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో మాతా వైష్ణోదేవి, మథుర, హరిద్వార్, రిషికేశ్ వంటి క్షేత్రాలను దర్శించుకోవచ్చు. 9 రాత్రులు, 10 పగళ్ల పాటు సాగే ఈ యాత్రకు టికెట్ ధర రూ. 16,500 నుంచి ప్రారంభమవుతుంది. భరత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా ఈ ప్రయాణం సాగుతుంది.

29 నిమిషాల క్రితం