మలయాళ చిత్ర పరిశ్రమలో 'వాళా 2'బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్తో, సరికొత్త నటీనటులతో రూపొందిన ఈ చిత్రం, విడుదలైన 17 రోజుల్లోనే ఏకంగా రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. అతి తక్కువ కాలంలో ఈ మైలురాయిని చేరుకున్న మలయాళ చిత్రాల్లో ఒకటిగా ఇది నిలిచింది.
సంబంధిత వార్తలు

పౌరాణిక పాత్రల మధ్య పోరు
భారతీయ చిత్ర పరిశ్రమలో మళ్లీ పౌరాణిక చిత్రాల ట్రెండ్ మొదలైంది. ఒకప్పుడు భక్తిరస చిత్రాలకే పరిమి తమైన పురాణ గాథలిప్పుడు అత్యాధునిక సాంకేతికతతో సినిమాటిక్ గా రూపాంతరం చెందుతున్నాయి. `రామాయణ`, `మహాభారతం` నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించ డానికి సిద్ధమవుతున్నాయి. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అగ్ర కథానాయకులు పౌరాణిక పాత్రల్లో పరకాయ ప్రవేశం.

‘అన్ని ఓ గురుతులు’ కి మంచి గుర్తింపు
వెంకట్ చల్లగుండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అన్ని ఓ గురుతులు ’పుట్టుకతోనే మన జీవితంతో ఎన్నో బంధాలు పెనవేసుకుపోతాయి. ప్రతి బంధం ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. నేనున్నాను అనే ధైర్యాన్ని ఇస్తుంది. ఒక నిజమైన తోడుగా ఉంటానని నమ్మకాన్ని కలిగిస్తుంది కానీ నీ అసలైన తోడు ఎవరు అనేది తెలిసే సరికి జీవితం మొత్తం ఖర్చు అయ్యుంటుంది.

గుండెపోటుతో ప్రముఖ ఎడిటర్ మధు రెడ్డి కన్నుమూత
తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కరీంనగర్కు చెందిన ప్రముఖ ఎడిటర్ మధు రెడ్డి హైదరాబాద్లోని మణికొండలో ఏప్రిల్ 18న గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సహచరులు, స్నేహితులు, ఆయనతో కలిసి పనిచేసిన సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి, దుఃఖానికి లోనయ్యారు. ఎడిటర్గా మధు రెడ్డికి ఇండస్ట్రీలో మంచి పేరుంది.

పనన్ కోసం అల్లు అర్జున్ ట్వీట్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ‘పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని, ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకుంటున్నాను. మీరు మళ్లీ పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆశిస్తున్నాను’ అంటూ బన్నీ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురై శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో అల్లు అర్జున్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.