LIVE
విజయవాడలో పోలీసులపై ఫైరింగ్
వెనక్కి
Crime

విజయవాడలో పోలీసులపై ఫైరింగ్

43 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

విజయవాడలో కాల్పులు కలకలం సృష్టించాయి. విజయవాడ బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఊహించని పరిణామం ఎదురైంది. ఓ వ్యక్తి పోలీసులపైనే తుపాకీతో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. విజయవాడ పోలీసులు, ఈగల్ అధికారులు బస్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. తనిఖీ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి అకస్మాత్తుగా తన వద్ద ఉన్న తుపాకీతో అధికారులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో నిందితుడు ట్రిగ్గర్ నొక్కినప్పటికీ, టెక్నికల్ లోపం కారణంగా బుల్లెట్ ఛాంబర్‌లోకి రాకపోవడంతో అధికారులు ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. పారిపోతున్న అతడిని పోలీసులు, ఈగల్ అధికారులు పట్టుకున్నారు. నిందితుడు తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, నెల్లికుదురు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి 9 MM పిస్టల్, ఐదు రౌండ్ల బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

షేర్ చేయండి:
7 మార్చి, 2026 01:45 PMకి

సంబంధిత వార్తలు

కర్నూలులో దారుణం..హాస్పిటల్‌ బెడ్‌పై బాలింతను చంపిన భర్త

కర్నూలులో దారుణం..హాస్పిటల్‌ బెడ్‌పై బాలింతను చంపిన భర్త

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. హాస్పిటల్‌ బెడ్‌పై బాలింతగా ఉన్న భార్యను భర్త దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. విచక్షణారహితంగా పొడవటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. కత్తితో పొడిచిన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

7 గంటల క్రితం
BREAKING: ఆగమైన హైద్రాబాద్.. రంగంలోకి హైడ్రా

BREAKING: ఆగమైన హైద్రాబాద్.. రంగంలోకి హైడ్రా

నగరంలో కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, బాచుపల్లి, సుచిత్ర తదితర ప్రాంతాల్లో వర్షానికి 53 చోట్ల చెట్లు పడిపోయాయి. 4సె.మీ. వర్షం కురవగా 8 చోట్ల రహదారులపై వర్షం నీరు నిలిచిపోయింది. ఈ ఫిర్యాదులను హైడ్రా సిబ్బంది క్లియర్ చేశారు. నగరవ్యాప్తంగా ఈదురుగాలులు వీచాయి. పలు చోట్ల చెట్లు పడిపోయినట్టు హైడ్రా కంట్రోల్ రూమ్ కి ఫిర్యాదులు రాగా రాత్రి 8.30 ప్రాంతం వరకు అన్ని క్లియర్ చేసినట్టు హైడ్రా తెలిపింది.

8 గంటల క్రితం
డబ్బున్న మైనర్లను ట్రాప్ చేస్తున్న ముఠా అరెస్ట్

డబ్బున్న మైనర్లను ట్రాప్ చేస్తున్న ముఠా అరెస్ట్

ఇన్‌స్టాలో డబ్బున్న బాలికలను ట్రాప్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కీలక నిందితుడు అర్జున్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విదేశాల్లో ఉంటున్న తల్లిదండ్రుల పిల్లలను, హైదరాబాద్‌లోని అత్యంత సంపన్న కుటుంబాలకు చెందిన మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుంటోంది ఈ గ్యాంగ్. ఒంటరిగా ఉండే పిల్లల బలహీనతలను ఆసరాగా చేసుకుని...సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వారితో స్నేహం నటిస్తూ ట్రాప్ చేస్తున్నారు.

8 గంటల క్రితం
OPERATION OCTOPUSE: 32 మంది బ్యాంక్ అధికారులు అరెస్ట్

OPERATION OCTOPUSE: 32 మంది బ్యాంక్ అధికారులు అరెస్ట్

HYD పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ ఆక్టోపస్-2.0’ ద్వారా దేశవ్యాప్త సైబర్ మోసాల ముఠా గుట్టురట్టయింది. 9 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన పోలీసులు, 32 మంది బ్యాంకు అధికారులు సహా మొత్తం 52 మందిని అరెస్ట్ చేశారు. నేరగాళ్లకు సహకరిస్తూ అక్రమ ఖాతాలు తెరిచి ఇచ్చిన బ్యాంకర్లే టార్గెట్‌గా ఈ ఆపరేషన్ సాగింది. ట్రేడింగ్, డిజిటల్ అరెస్ట్ పేరుతో దాదాపు రూ.150 కోట్ల మేర వీరు దోచుకున్నారు.

8 గంటల క్రితం