LIVE
IMG 4498
వెనక్కి
GeneralPolitics

పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు.. కేంద్ర మంత్రుల కీలక భేటీ

11 గంటల క్రితం
Telangana, Andhra Pradesh
సారాంశం

పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కేంద్ర మంత్రుల బృందం ఢిల్లీలో అత్యవసరంగా సమావేశమైంది. రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ కీలక భేటీలో జైశంకర్, జేపీ నడ్డా, హర్దీప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. అక్కడి పరిస్థితులు అనిశ్చితంగా ఉన్నాయని, ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేమని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. దేశ భద్రత, ఇంధన సరఫరా, విదేశాల్లోని మన పౌరుల రక్షణపై వీరు ప్రధానంగా చర్చించారు.

షేర్ చేయండి:
19 ఏప్రిల్, 2026 11:19 AMకి

సంబంధిత వార్తలు

EC WARNING: సోషల్‌ మీడియా పోస్టులపై ఈసీ చర్యలు

EC WARNING: సోషల్‌ మీడియా పోస్టులపై ఈసీ చర్యలు

ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా లో తప్పుదోవ పట్టించే పోస్టులు, చట్టవిరుద్ధమైన కంటెంట్‌పై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు 11 వేల సోషల్ మీడియా పోస్టులు, ఇతర కంటెంట్‌పై చర్యలు తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ నెల 23న TN, ఈ నెల 23, 29న రెండు దశల్లో WBలో పోలింగ్ ఉంది.

58 నిమిషాల క్రితం
హైదరాబాద్ లో వడగండ్ల వాన..బీ అలర్ట్!

హైదరాబాద్ లో వడగండ్ల వాన..బీ అలర్ట్!

హైదరాబాద్ వడగండ్ల వాన కురిసింది. కూకట్‌పల్లి, మూసాపేట్, జేఎన్‌టీయూ , నిజాంపేట్, కేపీహెచ్‌బీకాలనీ, ప్రగతి నగర్ బాచుపల్లి తదితర ప్రాంతాల్లో సాయంత్రం అకస్మాత్తుగా వడగళ్ల వాన పడింది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వచ్చే కొన్ని గంటలు ఉరుములు, గాలులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు... కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

1 గంటల క్రితం
మారథాన్ లో మనుషులను ఓడించిన చైనా రోబోలు

మారథాన్ లో మనుషులను ఓడించిన చైనా రోబోలు

బీజింగ్‌లో జరిగిన ఓ హాఫ్ మారథాన్‌లో హ్యూమనాయిడ్ రోబోలు మానవ అథ్లెట్లను ఓడించాయి. 12,000 మంది మానవ రన్నర్లతో చైనాలో తయారైన వందలాది హ్యూమనాయిడ్ రోబోలు పోటీపడ్డాయి. ఈ రోబోలు వేగంతో పరుగెత్తి, ఏకంగా ప్రపంచ రికార్డును సైతం బద్దలు కొట్టాయి. ఈ అద్భుత ప్రదర్శన, రోబో సాంకేతికతలో జరుగుతున్న వేగవంతమైన పురోగతికి నిదర్శనంగా నిలిచింది.

1 గంటల క్రితం
BREAKING: ఎయిర్ టెల్ బిగ్ షాక్.. రీఛార్జ్ కష్టమే..!

BREAKING: ఎయిర్ టెల్ బిగ్ షాక్.. రీఛార్జ్ కష్టమే..!

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. రీఛార్జ్ ప్లాన్ ధరలను అనూహ్యంగా పెంచింది. డెయిలీ 1.5GB ప్లాన్ తో ఉన్న రూ.799 ప్లాన్ ను ఏకంగా 899గా పెంచింది. అటు 56 రోజుల ప్లాన్ రూ. 859 పూర్తిగా రద్దు చేసింది. ఈ పెంపు వినియోగదారులకు భారీ షాక్ ఇస్తోంది.

2 గంటల క్రితం