
కొండగట్టుకు ఎందుకు రాలేదు: బీఆర్ఎస్ సభపై మంత్రి అడ్లూరి ఫైర్
బీఆర్ఎస్ సభపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. ‘పదేళ్లు అధికారంలో ఉండి అహంకారంతో ఊగిపోయిన మీరు, ఇప్పుడు నీతులు చెబుతారా?’ అని ప్రశ్నించారు. కొండగట్టు ప్రమాదంలో 60 మంది చనిపోతే రాని కేసీఆర్, ఇప్పుడు పదివేల మంది ఉండే సభకు హెలికాప్టర్లో రావడం ఏంటని ఎద్దేవా చేశారు. ఫాంహౌస్కే పరిమితమైన మీ నాయకుడు గుంటనక్కలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దళితులకు అన్యాయం చేశాడని ఫైర్ అయ్యారు.
సంబంధిత వార్తలు

ఇంతకీ పవన్ కళ్యాణ్ కి జరిగిన ఆపరేషన్ ఏమిటి.. అంతా ఓకే నా .. ??
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సైనసైటిస్ ఆపరేషన్ జరిగింది. అంటే సైనస్ నాళం లోకి ఎండోస్కోపీ ద్వారా పైప్ పంపించి ఇన్ఫెక్షన్ క్లియర్ చేశారు. సింపుల్ ప్రొసీజర్ కాబట్టి ఆ రోజే డిశ్చార్జ్ చేశారు. ఆయన ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

సెక్స్ కేసులో ఇరుక్కున్న బిజెపి నేత పుత్రరత్నం
ఉత్తర ప్రదేశ్ బిజెపి మాజీ మంత్రి నియర్ కుమార్ కుమారుడు రఘువంశీ అరెస్టు అయ్యారు. ముజఫర్ నగర్ లో ఒక మహిళను లైంగికంగా వేదించిన కేసులో అదుపులోకి తీసుకున్నారు. నీతులు చెప్పే బిజెపి నేతల వాస్తవ రూపం ఇదంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

విజయ్ వాగ్దానాలు అదిరి పోయాయిగా..!!
తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ అదరగొట్టే వాగ్దానాలు చేస్తున్నారు. పెళ్లి చేసుకునే పేదింటి ఆడపడుచులకు ఎనిమిది గ్రాముల బంగారం, పట్టుచీర బహుమతిగా ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి మహిళకు నెలకు 2, 500 నగదు సాయంతో పాటుగా ప్రతి ఇంటికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితం అని ప్రకటించారు.
మోదీ మహిళల తో రాజకీయాలు మానేసేయ్!
మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడం అత్యంత దురదృష్టకరమని మమతా బెనర్జీ మండిపడ్డారు. మహిళా సాధికారత ముసుగులో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కేంద్రం చూస్తోందని ఆమె ఆరోపించారు.ఈ బిల్లు విషయంలో భాజపా విఫల యత్నం ఆ పార్టీ అసలు రూపాన్ని బయటపెట్టిందని మమత (X) వేదికగా తీవ్రంగా విమర్శించారు.