* భవన నిర్మాణ కార్మికులకు త్వరలోనే పెన్షన్ సౌకర్యాన్ని కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. * ప్రతి జిల్లాలో భవన నిర్మాణ కార్మికుల కోసం 'సంఘ భవనం' నిర్మిస్తామని తెలిపారు. * గతంలో ఉన్న ప్రమాద బీమాను కాంగ్రెస్ ప్రభుత్వం ₹10 లక్షలకు పెంచిందని, దీని ద్వారా కార్మిక కుటుంబాలకు ఆర్థిక భద్రత లభిస్తుందని ఆయన గుర్తుచేశారు. * అర్హులైన ప్రతి కార్మికుడికి లేబర్ కార్డులు అందజేస్తామన్నారు
సంబంధిత వార్తలు

జాల్మూరి టేస్ట్ అదిరిందన్న ప్రధాని..
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారంతో బిజీగా ఉన్న ప్రధాని మోదీ మధ్యలో కాస్త విరామం తీసుకుని జార్గ్రామ్లో జాల్మురి రుచి చూశారు. వరుసగా4 ర్యాలీల మధ్య స్థానిక ఆహారాన్ని ఆస్వాదిస్తూ ఉత్సాహంగా గడిపినట్లు తన ఎక్స్ హ్యాండిల్లో వెల్లడించారు. జాల్మురి అనేది బెంగాలీలు ఇష్టంగా తినే స్నాక్. ముర్మురేలు, మసాలాలు, ఉల్లిపాయ, మిర్చితో తయారై కారంగా ఉండే ఈ స్నాక్ తనకు చాలా ఇష్టమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మండుటెండల్లో గాలి దుమారం.. కుండపోత వర్షం..
హైదరాబాద్లో వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. ఎల్బీ నగర్, అల్వాల్, మల్కాజ్గిరి, బాచుపల్లి , మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈదురు గాలులతో వాతావరణం చల్లబడటంతో , ఎండ లతో ఇబ్బందులు పడ్డ ప్రజలు.. రిలీఫ్ గా ఫీల్ అయ్యారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కూడా కురిసింది. క్యుములోనింబస్ మేఘాల వల్ల అకస్మాత్తుగ ఈ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

జగనన్న కాలనీలో చొరబడ్డ చిరుత..
చిత్తూరు నగర నడిబొడ్డున చిరుతల సంచారం కలకలం రేపుతోంది. దొడ్డిపల్లిలోని జగనన్న లేఔట్లో మూడు రోజులుగా తిరుగుతున్న చిరుత గాయాలపాలై స్పృహ తప్పి పడిపోయింది. తిరుపతి నుంచి రావాల్సిన రెస్క్యూ బృందం కోసం అటవీ శాఖ ఎదురుచూస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు పరిసరాలను ఖాళీ చేయించారు. చిరుతను చూసేందుకు ప్రజలుఎగబడ్డారు. మరోవైపు స్థానికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది.

బాలాపూర్లో అగ్నిప్రమాదం
బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయల్ కాలనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక ప్లాస్టిక్ షాపుల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్మేసింది. మంటలను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, వాటిని అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
