
దేవుళ్ళపై ఒట్టేసి మోసం చేశారు: రేవంత్ సర్కార్పై హరీష్ రావు ధ్వజం
NLG జిల్లా గుర్రంపోడ్లో జరిగిన BRS సమావేశంలో హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘‘రాష్ట్రంలో ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అనే మాటే వినిపిస్తోంది. పది రోజులైనా కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనే దిక్కు లేదు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి కప్పం కట్టడంలో బిజీగా ఉండి రైతుల బాధలు మర్చిపోయారు. దేవుళ్ల మీద ఒట్టేసి రుణమాఫీ పేరుతో రైతులను పచ్చి మోసం చేశారు అని విమర్శించారు.’’
సంబంధిత వార్తలు

ఇంతకీ పవన్ కళ్యాణ్ కి జరిగిన ఆపరేషన్ ఏమిటి.. అంతా ఓకే నా .. ??
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సైనసైటిస్ ఆపరేషన్ జరిగింది. అంటే సైనస్ నాళం లోకి ఎండోస్కోపీ ద్వారా పైప్ పంపించి ఇన్ఫెక్షన్ క్లియర్ చేశారు. సింపుల్ ప్రొసీజర్ కాబట్టి ఆ రోజే డిశ్చార్జ్ చేశారు. ఆయన ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

సెక్స్ కేసులో ఇరుక్కున్న బిజెపి నేత పుత్రరత్నం
ఉత్తర ప్రదేశ్ బిజెపి మాజీ మంత్రి నియర్ కుమార్ కుమారుడు రఘువంశీ అరెస్టు అయ్యారు. ముజఫర్ నగర్ లో ఒక మహిళను లైంగికంగా వేదించిన కేసులో అదుపులోకి తీసుకున్నారు. నీతులు చెప్పే బిజెపి నేతల వాస్తవ రూపం ఇదంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

విజయ్ వాగ్దానాలు అదిరి పోయాయిగా..!!
తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ అదరగొట్టే వాగ్దానాలు చేస్తున్నారు. పెళ్లి చేసుకునే పేదింటి ఆడపడుచులకు ఎనిమిది గ్రాముల బంగారం, పట్టుచీర బహుమతిగా ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి మహిళకు నెలకు 2, 500 నగదు సాయంతో పాటుగా ప్రతి ఇంటికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితం అని ప్రకటించారు.
మోదీ మహిళల తో రాజకీయాలు మానేసేయ్!
మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడం అత్యంత దురదృష్టకరమని మమతా బెనర్జీ మండిపడ్డారు. మహిళా సాధికారత ముసుగులో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కేంద్రం చూస్తోందని ఆమె ఆరోపించారు.ఈ బిల్లు విషయంలో భాజపా విఫల యత్నం ఆ పార్టీ అసలు రూపాన్ని బయటపెట్టిందని మమత (X) వేదికగా తీవ్రంగా విమర్శించారు.