జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ రాజకీయంగా ఒక క్రాస్ బ్రీడ్ అని విమర్శించారు. కేసీఆర్,కేటీఆర్ చేస్తున్న రాజకీయాల వల్ల వెలమ జాతి పరువు మొత్తం గంగలో కలిపిపోయిందని మండిపడ్డారు. 2023లో బిఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి రాకపోవడానికి కేటీఆర్ అహంకారం, ఆయన అక్రమ సంపాదనతో వచ్చిన బలుపు మాటలే ప్రధాన కారణమని సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు.
సంబంధిత వార్తలు

JAGITYAALA JUNG : జగిత్యాలలో ఉద్రిక్తత.. ఫ్లెక్సీలు ధ్వంసం
జగిత్యాలలో ఉద్రక్తిత పరిస్థితులు నెలకొన్నాయి. రేపు కేసీఆర్ భారీ బహిరంగ సభ సందర్భంగా జగిత్యాలలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదంగా మారాయి. కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ కోసం ఏర్పాటు చేసుకున్న జీవన్ రెడ్డి ఫ్లెక్సీలను సంజయ్ వర్గం చింపింది. దీంతో బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి ఓ పిక్ పాకెటర్: కేంద్రమంత్రి
కేంద్రమంత్రి శోభా కరంద్లాజే కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. CM రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్లో కేవలం గాంధీ కుటుంబానికే ప్రాధాన్యత ఉంటుందని, అది వారసత్వ రాజకీయాలకు నిలయమని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్లు మరియు నియోజకవర్గాల పునర్విభజనను అడ్డుకోవడం ద్వారా ఇండీ కూటమి దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ,బీఆర్ఎస్ లది ఫెవికాల్ బంధం: ఆది శ్రీనివాస్
కేటీఆర్, హరీష్ రావులకు ప్రజల సమస్యల కంటే బురద చల్లడమే పనిగా మారిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు.ఇద్దరూ కోడిగుడ్డు మీద ఈకలు పీకే నాయకులని ఫైర్ అయ్యారు. బిఆర్ఎస్, బీజేపీలు లోపాయికారీ ఒప్పందంతో పనిచేస్తున్నాయని, వారిది విడదీయలేని ఫెవికాల్ బంధమని ఆరోపించారు. తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్ దేనని ఎద్దేవా చేశారు.

NDA: దేశమంతా జన ఆక్రోష్.. NDA నిర్ణయం
మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంతో దేశవ్యాప్తంగా జన ఆక్రోస్ ర్యాలీ నిర్వహించేందుకు NDA కూటమి సిద్ధమైంది. మహిళా లోకానికి అన్యాయం చేసే విధంగా ఇండియా కూటమి వ్యవహరించిందని బీజేపీ మండిపడుతోంది. కాంగ్రెస్, ఇండియా కూటమి బిల్లు పట్ల వ్యవహరించిన తీరును ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కూటమి పార్టీలను కలుపుకుని జన ఆక్రోస్ ర్యాలీలు తీయనున్నారు.
