LIVE
IMG 4529
వెనక్కి
CrimeGeneral

ఎప్పుడూ సంక్షోభంలోనే లెబనాన్.. కారణాలివే!

2 గంటల క్రితం
Andhra Pradesh, Telangana
సారాంశం

లెబనాన్ తరచూ సంక్షోభాల్లో చిక్కుకోవడానికి అనేక కారణాలున్నాయి. క్లిష్టమైన భౌగోళిక, రాజకీయ పరిస్థితులు దేశాన్ని అస్థిరతలోకి నెట్టేస్తున్నాయని బీరుట్ బ్యూరో చీఫ్ మాయా గెబీలీ తెలిపారు. మంచి పొరుగు దేశాలు లేవని అత్యధిక లెబనీస్ ప్రజలు భావన. వీటికి తోడు దేశంలో తీవ్ర అంతర్గత రాజకీయ విభేదాలు, భారీ ఆర్థిక సంక్షోభం, ప్రాంతీయ ఉద్రిక్తతలు అన్నీ కలగలిపి లెబనాన్ పరిస్థితిని క్లిష్టంగా మార్చేస్తున్నాయి.

షేర్ చేయండి:
19 ఏప్రిల్, 2026 03:14 PMకి

సంబంధిత వార్తలు

మండుటెండల్లో గాలి దుమారం.. కుండపోత వర్షం..

మండుటెండల్లో గాలి దుమారం.. కుండపోత వర్షం..

హైదరాబాద్‌లో వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. ఎల్బీ నగర్, అల్వాల్, మల్కాజ్‌గిరి, బాచుపల్లి , మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈదురు గాలులతో వాతావరణం చల్లబడటంతో , ఎండ లతో ఇబ్బందులు పడ్డ ప్రజలు.. రిలీఫ్ గా ఫీల్ అయ్యారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కూడా కురిసింది. క్యుములోనింబస్ మేఘాల వల్ల అకస్మాత్తుగ ఈ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

16 నిమిషాల క్రితం
BREAKING: టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు.. 17 మంది మృతి

BREAKING: టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు.. 17 మంది మృతి

తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కట్టనార్‌పట్టి సమీపంలోని ఒక బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రసాయనాలు కలుపుతున్న సమయంలో ఘర్షణ జరగడం వల్లే ఈ పేలుడు సంభవించిందని నిర్ధారించారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలోని షెడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

26 నిమిషాల క్రితం
జగనన్న కాలనీలో చొరబడ్డ చిరుత..

జగనన్న కాలనీలో చొరబడ్డ చిరుత..

చిత్తూరు నగర నడిబొడ్డున చిరుతల సంచారం కలకలం రేపుతోంది. దొడ్డిపల్లిలోని జగనన్న లేఔట్‌లో మూడు రోజులుగా తిరుగుతున్న చిరుత గాయాలపాలై స్పృహ తప్పి పడిపోయింది. తిరుపతి నుంచి రావాల్సిన రెస్క్యూ బృందం కోసం అటవీ శాఖ ఎదురుచూస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు పరిసరాలను ఖాళీ చేయించారు. చిరుతను చూసేందుకు ప్రజలుఎగబడ్డారు. మరోవైపు స్థానికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది.

28 నిమిషాల క్రితం
ముగ్గురి ప్రాణాలు తీసిన రీల్స్  పిచ్చి..

ముగ్గురి ప్రాణాలు తీసిన రీల్స్ పిచ్చి..

రీల్స్ మోజు ముగ్గురు యువకుల ప్రాణాలు బలితీసుకుంది. మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాలో పల్సర్ బైకుపై అతివేగంగా వెళ్తూ నాటు తుపాకీతో విన్యాసాలు చేస్తూ వీడియో చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన బైక్ ఆగి ఉన్న ట్రక్కును బలంగా ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో బైక్ కూడా ట్రక్కును ఢీకొనడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

35 నిమిషాల క్రితం