దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ భారత్ లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం న్యూఢిల్లీకి చేరుకున్నారు. పాలం విమానాశ్రయంలో ఆయనకు ఉన్నత స్థాయి దౌత్య వర్గాలు ఘనస్వాగతం పలికాయి. భారత్-దక్షిణ కొరియాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా... ఈ పర్యటన అత్యంత కీలకంగా మారనుంది.
సంబంధిత వార్తలు

NDA: దేశమంతా జన ఆక్రోష్.. NDA నిర్ణయం
మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంతో దేశవ్యాప్తంగా జన ఆక్రోస్ ర్యాలీ నిర్వహించేందుకు NDA కూటమి సిద్ధమైంది. మహిళా లోకానికి అన్యాయం చేసే విధంగా ఇండియా కూటమి వ్యవహరించిందని బీజేపీ మండిపడుతోంది. కాంగ్రెస్, ఇండియా కూటమి బిల్లు పట్ల వ్యవహరించిన తీరును ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కూటమి పార్టీలను కలుపుకుని జన ఆక్రోస్ ర్యాలీలు తీయనున్నారు.

DEADLINE : ఈనెల 29లోగా లొంగిపోండి.. PM మోదీ డెడ్లైన్
పశ్చిమ బెంగాల్లోని బాంకురాలో జరిగిన సభలో PM మోదీ టీఎంసీపై విరుచుకుపడ్డారు. ఈ నెల 29లోగా అవినీతిపరులు, గుండాలు పోలీసులకు లొంగిపోవాలని, మే 4 తర్వాత అక్రమార్కులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని,TMC ప్రభుత్వం మహిళా హక్కులను అడ్డుకుంటోందని, చొరబాటుదారుల కోసం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగం, పేదరికానికి TMC కారణమని, బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

వడగండ్ల వాన...వరిపంట నష్టం
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి మండలాల్లోని పలు గ్రామాల్లో వడగండ్ల వాన కురవడంతో వరి పంట దెబ్బ తిన్నది. ఇప్పటికే కోతలు చేపట్టగా, కొద్దిమేర మిగిలిపోయిన పంట వడగండ్ల వానకు పూర్తిగా నేలరాలి చేతికందకుండా పోయింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షం కురవడంతో ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడ్డారు.

రేపే చందనోత్సవం..అప్పన్న నిజరూప దర్శనం!
సింహాచలంలో అక్షయ తృతీయను పురస్కరించుకుని చందనోత్సవం వైభవంగా జరగనుంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే స్వామివారి నిజరూప దర్శనం కోసం దేవస్థానం సర్వం సిద్ధం చేసింది. ఈ సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ధర్మకర్తల దర్శనం అనంతరం... 3:30నుండి సామాన్య భక్తులను అనుమతి అనుమతిస్తారు. సాయంత్రం 6గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి. ఈ ఏడాది సుమారు 2లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.
