
ఊసరవెళ్లిలా రంగులు మారుస్తూ మొసలి కన్నీరు..మోడీపై షర్మిల ఫైర్
ప్రధాని మోడీపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఫైర్ అయ్యారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో మోడీ అభినవ ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని మండిపడ్డారు. 33 శాతం రిజర్వేషన్ల అమలుకు అసలు ద్రోహి ఆయనేనని షర్మిల ధ్వజమెత్తారు. నారీశక్తి ముసుగులో డీలిమిటేషన్ బిల్లును తెరపైకి తెచ్చిన కపట సూత్రధారి మోడీ అని, ఇప్పుడు ప్రతిపక్షాలపై పెడబొబ్బలు పెడుతూ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శలు గుప్పించారు.
సంబంధిత వార్తలు

NDA: దేశమంతా జన ఆక్రోష్.. NDA నిర్ణయం
మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంతో దేశవ్యాప్తంగా జన ఆక్రోస్ ర్యాలీ నిర్వహించేందుకు NDA కూటమి సిద్ధమైంది. మహిళా లోకానికి అన్యాయం చేసే విధంగా ఇండియా కూటమి వ్యవహరించిందని బీజేపీ మండిపడుతోంది. కాంగ్రెస్, ఇండియా కూటమి బిల్లు పట్ల వ్యవహరించిన తీరును ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కూటమి పార్టీలను కలుపుకుని జన ఆక్రోస్ ర్యాలీలు తీయనున్నారు.

DEADLINE : ఈనెల 29లోగా లొంగిపోండి.. PM మోదీ డెడ్లైన్
పశ్చిమ బెంగాల్లోని బాంకురాలో జరిగిన సభలో PM మోదీ టీఎంసీపై విరుచుకుపడ్డారు. ఈ నెల 29లోగా అవినీతిపరులు, గుండాలు పోలీసులకు లొంగిపోవాలని, మే 4 తర్వాత అక్రమార్కులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని,TMC ప్రభుత్వం మహిళా హక్కులను అడ్డుకుంటోందని, చొరబాటుదారుల కోసం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగం, పేదరికానికి TMC కారణమని, బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

క్రాస్ బ్రీడ్ ఎవరిది..?కేటీఆర్ పై సంజయ్ హాట్ కామెంట్స్
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ రాజకీయంగా ఒక క్రాస్ బ్రీడ్ అని విమర్శించారు. కేసీఆర్,కేటీఆర్ చేస్తున్న రాజకీయాల వల్ల వెలమ జాతి పరువు మొత్తం గంగలో కలిపిపోయిందని మండిపడ్డారు. 2023లో బిఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి రాకపోవడానికి కేటీఆర్ అహంకారం, ఆయన అక్రమ సంపాదనతో వచ్చిన బలుపు మాటలే ప్రధాన కారణమని సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు.
తప్పదు.. ఓట్లు కావాలంటే మోకాళ్ళపై నడవాల్సిందే..
చర్చిలో మోకాళ్లపై నడుస్తూ టీవీకే చీఫ్ విజయ్ ప్రార్థనలు చేశారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన తిరుచిరాపల్లిలో సర్వమత పూజల్లో పాల్గొన్నారు. ముందుగా చర్చికి వెళ్లి మోకాళ్లపై నడుస్తూ ప్రార్థనలు చేశారు. అనంతరం మసీదుకు వెళ్లి ముస్లింల ఆశీర్వాదాలు పొందారు. మరి ఆయన ప్రార్తనలు ఫలిస్తాయో లేదో ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.