LIVE
Screenshot 2026 04 18 202159
వెనక్కి
General

ఓపెన్ స్కూల్ SSC పరీక్షలకు విస్తృత బందోబస్తు

1 రోజుల క్రితం
Telangana
సారాంశం

వికారాబాద్ జిల్లాలో ఈ నెల 20 నుంచి 27 వరకు నిర్వహించనున్న TOSS SSC, ఇంటర్మీడియట్ పరీక్షల కోసం కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద అప్రమత్త చర్యలు తీసుకున్నామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టినట్లు వెల్లడించారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

షేర్ చేయండి:
18 ఏప్రిల్, 2026 08:27 PMకి

సంబంధిత వార్తలు

అన్న క్యాంటీన్‌లో చంద్రబాబు అల్పాహారం..

అన్న క్యాంటీన్‌లో చంద్రబాబు అల్పాహారం..

తన 76వ పుట్టిన రోజు సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ పటమటలోని అన్న క్యాంటీన్‌కు వచ్చారు. భార్య భువనేశ్వరితో కలిసి కొంత మంది పేదలకు బ్రేక్ ఫాస్ట్ సర్వ్ చేశారు. అనంతరం అక్కడే అల్ఫాహారం స్వీకరించారు. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా అన్న క్యాంటీన్ కు రూ.76 లక్షలను భువనేవ్వరి విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. పేదల ఆకలి తీర్చే అవకాశం వచ్చినందుకు చంద్రబాబు దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.

9 నిమిషాల క్రితం
మళ్లీ భగ్గుమన్న ముడి చమురు ధరలు

మళ్లీ భగ్గుమన్న ముడి చమురు ధరలు

హార్ముజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా, ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మరోసారి భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 85.89 డాలర్లకు, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ధర 90.13 డాలర్లకు చేరుకుంది. 2027 వరకు అమెరికాలో పెట్రోల్ ధర గ్యాలన్‌కు 3 డాలర్ల పైన ఉండే అవకాశం ఉందని అమెరికా ఇంధన శాఖ మంత్రి పేర్కొన్నారు.

10 నిమిషాల క్రితం
రూ. 35 కోట్లతో విడాకుల  సెటిల్‌మెంట్..?

రూ. 35 కోట్లతో విడాకుల సెటిల్‌మెంట్..?

తమిళ హీరో విజయ్‌-సంగీత విడాకులపై చెన్నైలో ఆసక్తికర టాక్స్ నడుస్తున్నాయి . పరస్పర అంగీకారంతో విడిపోవాలని ఇరు వర్గాలు లాయర్లతో శనివారం చర్చించినట్లు సమాచారం. విడాకుల పిటిషన్‌ సోమవారం విచారణకు రానుంది. సెటిల్‌మెంట్‌గా రూ.250 కోట్లు కోరిన సంగీతకు, రూ.35 కోట్ల ఇవ్వటానికి విజయ్‌ అంగీకరించినట్లు తెలిసింది. పిల్లల బాధ్యతను తానే తీసుకుంటానని విజయ్‌ తెలిపినట్లు సమాచారం.

14 నిమిషాల క్రితం
విశాఖ నుంచి సింగపూర్‌కు జల విహారం..

విశాఖ నుంచి సింగపూర్‌కు జల విహారం..

విశాఖ నుంచి అంతర్జాతీయ క్రూజ్ షిప్ సేవలకు శ్రీకారం చుడుతున్నారు. జులై 15 నుంచి విశాఖ పోర్టు నుంచి క్రూజ్ ప్రయాణాలు ప్రారంభం కానున్నాయి. కార్డేలియా క్రూజ్ చెన్నై మీదుగా ఫుకెట్, లాంకావి, కౌలాలంపూర్, సింగపూర్ వరకు ప్రయాణించనుంది. 14 రోజుల ఈ పర్యటన పర్యాటకులను ఆకర్షించనుందని టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ వెల్లడించింది.

23 నిమిషాల క్రితం