LIVE
IMG 4533
వెనక్కి
Entertainment General

COOL WEATHER: హైదరాబాద్ ప్రజలకు ‘చల్లటి’ కబురు

1 గంటల క్రితం
Telangana, Andhra Pradesh
సారాంశం

హైదరాబాద్ ప్రజల కోసం చల్లని వార్త. భానుడి వేడిమికి అల్లాడుతున్న నగర ప్రజలకు త్వరలోనే ఉపశమనం కలగనుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు నగరంలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తూర్పు, ఉత్తర, పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లో బలమైన గాలులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. సిటీ సగం ప్రాంతాల్లో వర్షం పడటం వల్ల వేడి తగ్గి వాతావరణం కాస్త చల్లబడుతుంది.

షేర్ చేయండి:
19 ఏప్రిల్, 2026 03:36 PMకి

సంబంధిత వార్తలు

'వాలీ' మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించిన క్రిష్!

'వాలీ' మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించిన క్రిష్!

ప్రముఖ దర్శకుడు క్రిష్ జగర్లమూడి చేతుల మీదుగా విడుదలైన ‘వాలీ’ చిత్ర మోషన్ పోస్టర్ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్ తెరపై వాలీబాల్ క్రీడ నేపథ్యంలో వస్తున్న మొట్టమొదటి స్పోర్ట్స్ డ్రామాగా గుర్తింపు పొందిన ఈ చిత్రం, టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. క్రిష్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

6 నిమిషాల క్రితం
మండుటెండల్లో గాలి దుమారం.. కుండపోత వర్షం..

మండుటెండల్లో గాలి దుమారం.. కుండపోత వర్షం..

హైదరాబాద్‌లో వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. ఎల్బీ నగర్, అల్వాల్, మల్కాజ్‌గిరి, బాచుపల్లి , మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈదురు గాలులతో వాతావరణం చల్లబడటంతో , ఎండ లతో ఇబ్బందులు పడ్డ ప్రజలు.. రిలీఫ్ గా ఫీల్ అయ్యారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కూడా కురిసింది. క్యుములోనింబస్ మేఘాల వల్ల అకస్మాత్తుగ ఈ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

9 నిమిషాల క్రితం
బాక్సాఫీస్ వద్ద 'వాళా 2' విధ్వంసం!

బాక్సాఫీస్ వద్ద 'వాళా 2' విధ్వంసం!

మలయాళ చిత్ర పరిశ్రమలో 'వాళా 2'బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్‌తో, సరికొత్త నటీనటులతో రూపొందిన ఈ చిత్రం, విడుదలైన 17 రోజుల్లోనే ఏకంగా రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. అతి తక్కువ కాలంలో ఈ మైలురాయిని చేరుకున్న మలయాళ చిత్రాల్లో ఒకటిగా ఇది నిలిచింది.

12 నిమిషాల క్రితం
జగనన్న కాలనీలో చొరబడ్డ చిరుత..

జగనన్న కాలనీలో చొరబడ్డ చిరుత..

చిత్తూరు నగర నడిబొడ్డున చిరుతల సంచారం కలకలం రేపుతోంది. దొడ్డిపల్లిలోని జగనన్న లేఔట్‌లో మూడు రోజులుగా తిరుగుతున్న చిరుత గాయాలపాలై స్పృహ తప్పి పడిపోయింది. తిరుపతి నుంచి రావాల్సిన రెస్క్యూ బృందం కోసం అటవీ శాఖ ఎదురుచూస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు పరిసరాలను ఖాళీ చేయించారు. చిరుతను చూసేందుకు ప్రజలుఎగబడ్డారు. మరోవైపు స్థానికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది.

20 నిమిషాల క్రితం